కొలంబో: శ్రీలంక ఆల్రౌండర్ తిసారా పెరీరా సోమవారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 11 ఏండ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఏడు క్రికెట్ ప్రపంచకప్ల్లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నానని పెరీరా చెప్పాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికిన పెరీరా శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ)కి ఓ లేఖ రాశాడు.
తాను వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చిందని, యువ, ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. లంక జట్టుకు వన్డే, టీ20 కెప్టెన్గా వ్యవహరించిన పెరీరా..ఇకపై తన వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడానికి, కుటుంబంతో గడపడానికి సమయం దొరికిందని పేర్కొన్నాడు.
లంక తరఫున పెరీరా 166 వన్డేలు, 84టీ20లు, 6 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ 37 మ్యాచ్లు ఆడాడు.