న్యూఢిల్లీ : సచిన్ సలహాతోనే తన కెరీర్ పొడిగింపు జరిగిందని భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించింది. 2017 ప్రపంచకప్నకు ముందు లండన్లో సచిన్తో జరిపిన సంభాషణతో తన బ్యాటింగ్ శైలిలో మార్పు చేసుకున్నానని, అది తన కెరీర్ మరింత పొడిగించుకోడానికి దోహదం చేసిందన్నది.
రెండు దశాబ్దాలకు పైగా ఆటకు సేవలందించిన సచిన్, మిథాలీ భారత క్రికెట్లో ఆణిముత్యాలనవచ్చు. సచిన్ 50వ జన్మదినం సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ సచిన్ సూచనతోనే తన కెరీర్ సజావుగా సాగిందని, అందుకు కృతజ్ఞతలు తెలిపింది. సచిన్తో ఎవరినీ పోల్చలేమని, ఆటకు దూరమైనా ఇప్పటికీ ఆటపట్ల సచిన్ ఆరాధనాభావంతో ఉంటాడన్నది.