Sadagoppan Ramesh : సదగోపన్ రమేశ్.. భారత క్రికెట్ అభిమానులకు పరిచయమున్న పేరే. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఓపెనర్గా రాణించిన ఆటగాడు. రిటైర్మెంట్ తర్వాత రమేశ్(Sadagoppan Ramesh) కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఓపెనర్గా ఫ్యాన్స్ను అలరించిన రమేశ్ ఇప్పుడు తమిళ సినిమా(Tamil Cinema Industry)లో హీరోగా రాణిస్తున్నాడు.
అవును.. 2008లో అతను తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ‘సంతోష్ సుబ్రమణ్యం'(Santosh Subramaniam) సినిమాలో జయం రవి(Jayam Ravi), జెనీలియా(Jenelia), ప్రకాశ్రాజ్(Prakash Raj)తో వంటి స్టార్లతో కలిసి బిగ్స్క్రీన్ను పంచుకున్నాడు. 56వ సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డు(56th South FilmFare Awards)ల్లో ఈ సినిమాకు బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ పురస్కారాలు దక్కాయి.
సుబ్రమణ్యం సినిమాతో రమేశ్కు అవకాశాలు పెరిగాయి. 2011లో క్రీడా నేపథ్యంతో రూపుదిద్దుకున్న కామెడీ సినిమా ‘పొట్టాపొట్టి'(Potta Potti)లోనూ రమేశ్ నటించాడు. ఈ చిత్రం అభిమానుల ఆదరణ చూరగొన్నది. ఆ తర్వాత మదగజరాజా సినిమాలోనూ అతను కీలక పాత్ర పోషించాడు.
పొట్టాపొట్టి సినిమాలో రమేశ్
ఒకవైపు నటిస్తూనే మరోవైపు.. తన అభిరుచులకు అనుగుణంగా కరాకోలో ‘స్వరాస్'(Swaras) పేరిట 2019లో మల్టీపర్పస్ స్టూడియో నిర్మించాడు. అలాగని తనకెంతో ఇష్టమైన క్రికెట్ను వదల్లేదు. అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్ వ్యాఖ్యాతగా, రియాల్టీ టీవీ షోలో జడ్జీగా వ్యవహరిస్తున్నాడు.
రమేశ్ 1999లో చెన్నైలో పాకిస్థాన్తో జరిగిన టెస్టు మ్యాచ్తో ఆరంగేట్రం చేశాడు. అయితే.. ఈ లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్ ఎక్కువ కాలం టీమిండియాకు ఆడలేదు. కెరీర్లో 19 టెస్టులు, 24 వన్డేలు ఆడిన రమేశ్ రెండు సెంచరీలు, 14 అర్ధసెంచరీలు సాధించాడు. యువ క్రికెటర్ల నుంచి పోటీ పెరగడంతో రమేశ్.. జాతీయ జట్టుకు దూరం అయ్యాడు. అయితే.. ఆటకు వీడ్కోలు పలికిన అతను ఐపీఎల్(Indian Premiere League)లో ఆడేందుకు ఆసక్తి చూపించలేదు.