వెల్లింగ్టన్: మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (282 బంతుల్లో 132) సూపర్ సెంచరీ నమోదు చేయడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పోరాడే స్కోరు(483) చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్లో ఫాలోఆన్ ఆడుతూ కివీస్ గొప్ప పోరాటం కనబర్చింది. విలియమ్సన్తో పాటు బ్లండెల్ (90), టామ్ లాథమ్ (83), కాన్వే (61), మిషెల్ (54) రాణించారు.
ఈ క్రమంలో విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (7787) చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. రాస్ టేలర్ (7683) రెండో స్థానం లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లీచ్ 5 వికెట్లు పడగొట్టారు. అనంతరం 258 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. సోమవారం నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న ఇంగ్లిష్ జట్టు.. విజయానికి ఇంకా 210 పరుగులు చేయాల్సి ఉంది. డకెట్ (23), రాబిన్సన్ (1) క్రీజులో ఉన్నారు.