బర్మింగ్హామ్: మాజీ కెప్టెన్ జో రూట్ (118 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీ బాదడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. రూట్తో పాటు బెయిర్స్టో (78; 12 ఫోర్లు), జాక్ క్రాలీ (61; 7 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో ఇంగ్లండ్ 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
పోప్ (31), బ్రూక్ (32) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో లియాన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా.. 14 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆసీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 379 పరుగులు వెనుకబడి ఉంది. వార్నర్ (8), ఖవాజా (4) క్రీజులో ఉన్నారు.