న్యూఢిల్లీ: వరల్డ్కప్లో భాగంగా అహ్మాదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్(India Vs Pakistan) మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 14వ తేదిన జరగనున్న ఆ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. అయితే సోమవారం ఆ మ్యాచ్కు చెందిన టికెట్లను అమ్మారు. సౌత్ ప్రీమియం వెస్ట్ బే టికెట్ సంస్థకు చెందిన వయాగోగో ద్వారా ఆన్లైన్లో టికెట్లు అమ్మారు. ఆ ప్లాట్ఫామ్లో కొన్ని టికెట్లకు 19.5 లక్షలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అయితే స్టేడియంలోని అప్పర్ టైర్లో ఉన్న కొన్ని టికెట్లు ఇంకా అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని టికెట్లను 57 లక్షలకు అమ్మినట్లు అంచనా వేస్తున్నారు.
టికెట్ ఖరీదు మరీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. క్రికెట్ లవర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఘాటు విమర్శలు చేస్తున్నారు. వయాగోగో వెబ్సైట్లో కొన్ని టికెట్లు 65 వేల నుంచి 4.5 లక్షల వరకు అమ్ముడవుతున్నాయని ఓ యూజర్ పేర్కొన్నారు. పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓ టికెట్ను 15 లక్షలకు అమ్ముతున్నట్లు వయోగోగో యాప్లో చూశానని మరో యూజర్ పేర్కొన్నాడు. సెకండరీ మార్కెట్ ద్వారా అమ్మే టికెట్లు అధిక ధరను వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్కు 41 వేల నుంచి 3 లక్షల వరకు అమ్మారు. ఇక ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్కు టికెట్ ధర 2.3 లక్షలుగా ఉంది.