అహ్మదాబాద్ : వరుసగా అయిదు సిక్సర్లతో కోల్కతాకు అనూహ్య విజ యం అందించిన రింకూ సింగ్ మ్యాచ్ తర్వాత తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. ఆదివారం గుజరాత్తో జరిగిన పోరులో రింకూ చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులు అవసరమైన తరుణంలో చిచ్చరపిడుగులా చెలరేగి సిక్సర్లతో మోతమోగించిన విషయం తెలిసిందే. అయితే తన విజయానికి కెప్టెన్ నితీష్ రాణా పరోక్షంగా కారణమని రింకూ తెలిపాడు. రాణా బ్యాట్తోనే తాను ఆ సిక్సర్లు సాధించినట్టు తెలిపాడు. గత సీజన్లో ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉపయోగించిన బ్యాట్ను రాణా ఆదివారం నాటి మ్యాచ్లో పక్కనబెట్టి మరో బ్యాట్తో బ్యాటింగ్ చేశాడు. ఆ బ్యాట్ తనకు ఇవ్వాల్సిందిగా రింకూ అభ్యర్థనను మన్నించి రాణా తన బ్యాట్ను రింకూ కు ఇచ్చాడు.