క్యాన్బెరా: ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. క్యాన్బెరాలోని మనూకా ఓవల్ పిచ్లో మ్యాచ్ జరగనున్నది. తమ బ్యాటింగ్ ఆర్డర్ను పరీక్షించాలనుకుంటున్నట్లు ఆసీస్ కెప్టెన్ మార్ష్ పేర్కొన్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి సంతోషంగా ఉందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కలేదు.
🚨 Toss 🚨#TeamIndia have been asked to bat first in Canberra.
Updates ▶️ https://t.co/VE4FvHCa1u
#AUSvIND | #1stT20I pic.twitter.com/tfUulkeLDZ
— BCCI (@BCCI) October 29, 2025
ప్రస్తుతం అందరి దృష్టి ఇప్పుడు అభిషేక్ శర్మపై ఉన్నది. ఇటీవల ముగిసిన ఆసియా కప్ టోర్నీలో అభిషేక్ తన ఫామ్లో అలరించాడు. టాప్ ఫామ్లో ఉన్న అతను ఆ టోర్నీలో అత్యధికంగా 314 రన్స్ స్కోర్ చేశాడు. టీ20 స్పెషలిస్టు బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే. తొలి మూడు టీ20 మ్యాచ్లకు నితీశ్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టేశారు. అడిలైడ్లో జరిగిన రెండో వన్డేలో అతను గాయపడ్డాడు. మెడ భాగంలో నొప్పి కారణంగా అతన్ని తొలి మూడు మ్యాచ్లకు దూరం పెడుతున్నట్లు బీసీసీఐ పేర్కొన్నది.
🚨 Update
Nitish Kumar Reddy has been ruled out for the first three T20Is. The all-rounder who was recovering from his left quadriceps injury sustained during the second ODI in Adelaide, complained of neck spasms, which has impacted his recovery and mobility. The BCCI Medical… pic.twitter.com/ecAt852hO6
— BCCI (@BCCI) October 29, 2025
భారత జట్టు : అభిషేక్, తిలక్ వర్మ, గిల్, సూర్యకుమార్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిష్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవన్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఫిలిప్, గ్జావియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహెనిమాన్, హేజిల్వుడ్