ముంబై: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై కేసు నమోదైంది. వినోద్ కాంబ్లీ రోజూ తాగొచ్చి కొట్టడమేగాక నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడుతున్నాడని అతని భార్య ఆండ్రియా ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అనంతరం సీఆర్పీసీ సెక్షన్ 41ఎ ప్రకారం బాంద్రా పోలీసులు కాంబ్లీ నోటీసులు జారీచేశారు. బాంద్రా పోలీసులు స్వయంగా కాంబ్లీ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చి ఆండ్రియా ఫిర్యాదుపై తమకు వాంగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.