టోక్యో: ఒలింపిక్స్లో భారత ఫెన్సర్ భవానీ దేవికి చుక్కెదురయింది. ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో ఓడిపోయింది. ఫ్రాన్స్కు చెందిన మనన్ బ్రూనెట్తో జరిగిన మ్యాచ్లో 7-15 తేడాతో ఓటమిపాలైంది. మొదటిసారిగా ఒలింపిక్స్ ఆడుతున్న 27 ఏండ్ల భవానీ దేవి.. తన తొలి పోరులో టునీషియాకు చెందిన నదియాపై విజయం సాధించి శుభారంభం పలికింది. 15-3 పాయింట్ల తేడాతో గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించింది. అయితే రెండో రౌండ్లో ఓడిపోవడంతో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆమె పూర్తిపేరు చదలవాడ ఆనంద సుంధరరామన్ భవానీ దేవి.
టేబుల్ టెన్నిస్ పురుషుల రెండో రౌండ్లో ఆచంట శరత్ కమల్ విజయం సాధించాడు. పోర్చుగల్ ప్లేయర్ అపోలోనియా టియాగోపై 4-2 తేడాతో చారిత్రక విజయం సొంతం చేసుకున్నాడు. 49 నిమిషాల్లోనే వరల్డ్ 59వ ర్యాంక్ ఆటగాడిని 2-11 11-8 11-5 9-11 11-6 11-9 స్కోర్తో మట్టికరిపించి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో మనికా బాత్రా మూడో రౌండ్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.