ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తన పేరును చెడుగా ఉపయోగించుకుంటున్న మోసగాళ్లపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతర్జాలంలో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫొటో వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అందులో పేర్కొన్నాడు. తన పొటోతో పాటు వాయిస్ను చెడు మార్గాల్లో ఉపయోగిస్తూ..
ఫేక్ యాడ్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు ఐసీసీ సెక్షన్ 426, 465, 500 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సలహాదారుగా ఉన్న సచిన్.. ఇటీవలే 50వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే.