బెంగళూరు : రవిచంద్రన్ అశ్విన్ నేతృత్వంలోని భారత స్పిన్ దళాన్ని వారి దేశంలో ఎదుర్కోవడం గొప్ప సవాల్తో కూడుకున్నదని ఆస్ట్రేలియా మేటి బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా వ్యాఖ్యానించాడు. భారత్తో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ గురువారం నాగపూర్ టెస్టుతో ఆరంభం కానున్న నేపథ్యంలో ఖవాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వీపా సమస్యతో ఆలస్యంగా భారత్కు చేరుకున్న ఖవాజా భారత్తో సిరీస్లో డేవిడ్ వార్నర్తో కలిసి ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. ఈ సిరీస్లో తమకు అశ్విన్నుంచే ఎక్కువ సవాల్ ఎదురు కానున్నదని, అందుకే స్పిన్ను ఎదుర్కోవడంపై ఎక్కువగా సాధన చేస్తున్నామని ఖవాజా తెలిపాడు.