న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేస్ బౌలర్ ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ కారులో ఆయన కుమారుడు కూడా ఉన్నారు. మీరట్ వద్ద ఈ ఘటన జరిగింది. 36 ఏళ్ల ప్రవీణ్ కుమార్ ఇండియా తరపున ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20 మ్యాచ్లు ఆడాడు. అయితే ప్రస్తుతం బాగానే ఉన్నట్లు ప్రవీణ్ తెలిపారు. చాలా ఘోరం జరిగేదని, కానీ దేవుని దయవల్ల బాగానే ఉన్నామని, మేనల్లుడిని దించేందుకు వెళ్లాలని, రాత్రి 9.30 నిమిషాల సమయంలో ఓ భారీ ట్రక్కు తన కారును ఢీకొన్నట్లు బౌలర్ ప్రవీణ్ తెలిపాడు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఓ రెస్టారెంట్ను కూడా ప్రవీణ్ నడుపుతున్నాడు. కారు పెద్దది కావడం వల్ల ఎటువంటి గాయాలు కాలేదన్నాడు. బంపర్ మాత్రమే డ్యామేజ్ అయి ఉంటుందని తొలుత భావించానని, కానీ కారు పూర్తిగా డ్యామేజ్ అయ్యిందన్నాడు. గత ఏడాది జూన్లో కీపర్ రిషబ్ పంత్ కూడా కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. డెహ్రాడూన్ వద్ద అతని లగ్జరీ కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు రిషబ్ ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.