భోపాల్: రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్ మరోమారు అదరగొట్టింది. కుమార్ సురేంద్రసింగ్ స్మారక జాతీయస్థాయి షూటింగ్ టోర్నీలో ఇషా పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ఇషాసింగ్ 585 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. ఈ క్రమంలో ఒలింపిక్ స్థాయి షూటర్లు మనుభాకర్(583), రాహి సర్నోబత్(582)ను అధిగమిస్తూ ఇషా సత్తాచాటింది. ఇటీవలే జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో ఈ తెలంగాణ యువ షూటర్ పసిడి పతకాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.