హైదరాబాద్: స్వదేశంలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ఇండియా (Team India) మరో ఆసక్తికర టోర్నీకి సిద్ధమైంది. గత పుష్కర కాలంగా ప్రత్యర్థికి సిరీస్ కోల్పోని భారత్.. అదే పంథాను కొనసాగించేందుకు పట్టుదలతో ఉంది. మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఉప్పల్ వేదికగా మొదటి టెస్ట్లో ఇంగ్లండ్ జట్టుతో (England) రోహిత్ సేన తలపడుతున్నది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లిష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
స్పిన్ ద్వయం అశ్విన్, అక్షర్ పటేల్లకు తుది జట్టులో స్థానమిచ్చిన భారత్.. పేసర్లు బుమ్రా, సిరాజ్తో బరిలోకి దిగుతున్నది. ఇక ఇంగ్లండ్ ప్లేయర్ టామ్ హార్ట్లె ఈ మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం ఇవ్వనున్నాడు. కాగా, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో ఇరుజట్లు గెలుపు కోసం కడదాకా ప్రయత్నించే అవకాశముంది. కాగా, బలబలాల పరంగా రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా..సొంతగడ్డపై ఆడటం టీమ్ఇండియాకు అదనపు బలం కానుంది.
భారత్: రోహిత్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్పటేల్, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, సిరాజ్
ఇంగ్లండ్: బెన్ స్టోక్స్(కెప్టెన్), క్రాలె, డకెట్, పోప్, రూట్, బెయిర్స్టో, ఫోక్స్, రేహాన్ అహ్మద్, మార్క్ వుడ్, టామ్ హార్ట్లె, లీచ్.