Ashes Series : యాషెస్ సిరీస్లో బోణీ కొట్టిన ఇంగ్లండ్(England) నాలుగో టెస్టుకు సిద్ధమవుతోంది. మూడో టెస్టు విజయం ఇచ్చిన ఉత్సాహంతో సిరీస్ను సమం చేయాలనుకుంటోంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈరోజు 14మందితో కూడిన జట్టును ప్రకటించింది. పేలవ ప్రదర్శనతో మూడో టెస్టుకు దూరమైన సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson), యంగ్స్టర్ జోష్ టంగ్(Josh Tongue) తిరిగి జట్టులోకి వచ్చారు.
ఫిట్నెస్ సరిగా లేని ఓలీ రాబిన్సన్, వరుసగా విఫలమవుతున్న జానీ బెయిర్స్టోను తప్పించలేదు. సిరీస్లో కీలకమైన నాలుగో టెస్టు ఓల్డ్ ట్రఫోర్డ్(Old Trafford) స్టేడయంలో జూలై 19 నుంచి మొదలవ్వనుంది. ఐదు టెస్టుల సిరీస్లో రెండు విజయాలు సాధించిన ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది.
జేమ్స్ అండర్సన్
ఇంగ్లండ్ స్క్వాడ్ : బెన్ డకెట్, జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), డాన్ లారెన్స్, మోయిన్ అలీ, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.
యాషెస్ తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైన ఇంగ్లండ్ మూడో టెస్టులో సంచలన విజయం సాధించింది. చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో విధ్వంసక ఆటగాడు హ్యారీ బ్రూక్(75) అద్భుత హాఫ్ సెంచరీతో మెరిశాడు. 251 పరుగుల లక్ష్య ఛేదనలో ఒకవైపు వికెట్లు పడుతున్నా బౌండరీలతో స్కోర్బోర్డును పరుగులు పెట్టించాడు.
హాఫ్ సెంచరీ(75)తో రాణించిన హ్యారీ బ్రూక్
జో రూట్(21), బెన్ స్టోక్స్(13), జానీ బెయిర్ స్టో(5)తో కలిసి కీలక పరుగులు జోడించి జట్టును గెలుపు వాకిట నిలిపాడు. అతను ఔటయ్యాక ఆల్రౌండర్ క్రిస్ వోక్స్(32 నాటౌట్), మార్క్ వుడ్(16 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. దాంతో, ఆతిథ్య జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్లో నిలిచింది.