England Cricketers: ప్రపంచంలో ఎక్కడైనా విషాద సంఘటనలు జరిగినప్పుడు క్రికెటర్లు(Cricketers) సంఘీభావం తెలియజేయడం చూశాం. నల్ల బ్యాడ్జీలు(Black Badges) ధరించి మైదానంలోకి రావడం, మౌనం పాటించి నివాళిలు అర్పించడం మామూలే. తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్లు అచ్చం అలాంటి పనే చేశారు. యాషెస్(Ashes Series) ఆఖరి టెస్టు మూడో రోజు ఇంగ్లండ్(England Cricketers) ఆటగాళ్లు ఒకరి జెర్సీ మరొకరు వేసుకున్నారు. అదేంటీ..? వాళ్లకు ఏమైనా మతిమరుపా? అని నవ్వుకునేరు. అస్సలు కాదు. ఇంగ్లండ్ టీమ్ అలా జెర్సీలు మార్చుకోవడం వెనుక ఓ మంచి కారణం ఉంది. అల్జీమర్స్(Alzheimers)తో బాధపడుతున్న వాళ్లకు మద్దతుగా బెన్ స్టోక్స్ బృందం అలా జెర్సీలు ధరించింది.
మూడో రోజు తొలి సెషన్కు ముందు ఇంగ్లండ్ క్రికెటర్లంతా మారు జెర్సీలతో మైదానంలోకి వచ్చారు. కెప్టెన్ స్టోక్స్ వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో జెర్సీ వేసుకున్నాడు. మోయిన్ అలీ మాజీ కెప్టెన్ జోరూట్ జెర్సీతో వచ్చాడు. జేమ్స్ అండర్స్ మరో పేసర్ స్టువార్ట్ బ్రాడ్ జెర్సీతో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఒక్క చోట చేరారు. అల్జీమర్స్ సొసైటీ సభ్యులు ఆలపించిన పాట విన్నారు. అనంతరం మ్యాచ్ ప్రారంభమైంది.
A moving and powerful rendition of Jerusalem 👏@alzheimerssoc | #CricketShouldBeUnforgettable pic.twitter.com/cMC37JWC96
— England Cricket (@englandcricket) July 29, 2023
అల్జీమర్స్ అనేది ఒక వృద్దాప్య సమస్య. 60 ఏళ్లు పైబడిన వాళ్లలో రోజు రోజుకు మతిమరుపు(Memory Loss) పెరుగుతుంటుంది. దాంతో, వాళ్లు అన్ని విషయాలు మర్చిపోతారు. కుటుంబసభ్యులను, ప్రాణ స్నేహితులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటారు. అంతేకాదు దానివల్ల వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వేళకు తినరు, మందులు వేసుకోరు. రోజూవారీ పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. కొందరిలో మాట తడబడుతుంది. మొత్తంగా ఇంతకు ముందు ఉన్నట్టు హుషారుగా ఉండలేరు.
యాషెస్ సిరీస్లోని ఆఖరి టెస్టు రసవత్తరంగా జరుగుతోంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. హ్యారీ బ్రూక్(82) హాఫ్ సెంచరీ, బెన్ డకెట్(41) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 283 రన్స్ కొట్టింది.
బెన్ డకెట్(42)