దుబాయ్: యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్కు పాల్పడినందుకు ఇంగ్లండ్ జట్టుపై ఐసీసీ జరిమానా విధించగా.. తాజాగా దాన్ని సవరించింది. వారం రోజుల క్రితం ఇంగ్లిష్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో 100 శాతం కోత విధించిన ఐసీసీ.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల నుంచి ఐదింటిని తొలగించింది. అయితే పాయింట్ల సంఖ్య 5 కాదు ఎనిమిది అని ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. గబ్బాలో జరిగిన తొలి టెస్టులో నిర్ణీత సమయంలో ఇంగ్లండ్ ఎనిమిది ఓవర్లు తక్కువ వేయడంతోనే జరిమానాను సవరించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.