రాజ్కోట్: ఇంగ్లండ్ స్పిన్నర్ రెహన్ అహ్మద్(Rehan Ahmed)కు వీసా చిక్కులు ఎదురయ్యాయి. సింగిల్ ఎంట్రీ వీసాతో ఇండియాకు వచ్చిన రెహన్.. రెండో టెస్టు ముగిసిన తర్వాత జట్టు సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అయితే మూడో టెస్టు కోసం రాజ్కోట్ చేరుకున్న అతనికి అధికారులు ఎంట్రీ ఇవ్వలేదు. రెండవ, మూడవ టెస్టు మధ్య పది రోజుల గ్యాప్ ఉన్న కారణంగా ఇంగ్లండ్ క్రికెటర్లు సేద తీరేందుకు దుబాయ్ వెళ్లారు. ఇక రాజ్కోట్ చేరుకున్న రెహన్కు వీసా ఎంట్రీ దక్కలేదు. దీంతో అతను మళ్లీ పేపర్వర్క్ చేయాల్సి వచ్చింది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది. రెహన్కు ఎంట్రీ ఇవ్వలేదని, ఆ తర్వాత అధికారులు తాత్కాలిక వీసా జారీ చేసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.