ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ హీరో రిషభ్ పంత్ (57) రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్లో లీచ్ బౌలింగ్లో ధాటిగా ఆడిన అతను.. రెండో ఇన్నింగ్స్లో అతని బౌలింగ్లోనే వికెట్ పోగొట్టుకున్నాడు.
ఆఫ్ స్టంప్ ఆవలగా లీచ్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేసేందుకు పంత్ ప్రయత్నించాడు. అయితే బంతి టర్న్ అవడంతో అతను అనుకున్నట్లు బ్యాట్ కనెక్ట్ కాలేదు. దీంతో లెగ్ స్లిప్స్లో ఉన్న రూట్కు సులభమైన క్యాచ్ దక్కింది. రూట్ ఎలాంటి పొరపాటు లేకుండా దాన్ని అందుకోవడంతో పంత్ నిరాశగా పెవిలియన్ చేరాడు.