మూడో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. పంత్ (1), కోహ్లీ (11) విఫలమవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అనుకున్న రోహిత్ శర్మ (11) కూడా నిరాశ పరిచాడు. టాప్లే వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. టాప్లే వేసిన బంతిని లెగ్ సైడ్ భారీ షాట్ ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు.
అయితే స్లో బాల్ను సరిగా జడ్జ్ చేయలేకపోయిన అతను.. దాన్ని నేరుగా ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్ వైపు కొట్టాడు. సాల్ట్ ఎలాంటి పొరపాటు లేకుండా క్యాచ్ అందుకోవడంతో రోహిత్ వెనుతిరిగాడు. దీంతో టీమిండియా పవర్ప్లే ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 34 పరుగులతో నిలిచింది.