ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న ఛటేశ్వర్ పుజారా (66) పెవిలియన్ చేరాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన షార్ట్ బాల్ను కట్ చేసేందుకు ప్రయత్నించిన అతను.. బ్యాక్వర్డ్ పాయింట్లో లీస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
నాలుగో రోజు ఆట ఆరంభమైన తర్వాత కొంచెం వేగంగా బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించిన పుజారా.. బౌండరీల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బ్రాడ్ వేసిన బంతికి అవుటయ్యాడు. పుజారా వెనుతిరగడంతో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. భారత జట్టు 153 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి టీమిండియా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది.