ఎడ్జ్బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 245 పరుగులకు ఆలౌట్ అయింది. లంచ్ తర్వాత షమీ (13), జడ్డూ (23) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన బుమ్రా (7)ను స్టోక్స్ అవుట్ చేశాడు. స్టోక్స్ వేసిన షార్ట్ బాల్ను పుల్ చేసి సిక్సర్ బాదిన బుమ్రా.. ఆ తర్వాతి బంతికి అవుటయ్యాడు.
స్టోక్స్ వేసిన షార్ట్ బాల్ను మరోసారి స్టాండ్స్లోకి పంపేందుకు ప్రయత్నించిన బుమ్రా.. క్రాలీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 245 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యం నిలిచింది. మరి ధాటిగా ఆడే ఇంగ్లండ్ లైనప్ను భారత బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి.
India's second innings come to an end, bowled out for 245. Ben Stokes finishes with four wickets.
England need 378 to win #ENGvIND pic.twitter.com/IjNPANUnhn
— Doordarshan Sports (@ddsportschannel) July 4, 2022