భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తడబడి నిలబడింది. రెండో ఓవర్లోనే సిరాజ్ వేసిన సూపర్ బౌలింగ్కు ప్రమాదకర జానీ బెయిర్స్టో (0), జో రూట్ (0) ఇద్దరూ డకౌట్ అవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ (24 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.
దీంతో ఓపెనర్ జేసన్ రాయ్ (41 నాటౌట్) కూడా పట్టుదలగా ఆడాడు. వీళ్లిద్దరూ ఆచితూచి ఆడుతూ అవకాశం దొరికిన ప్రతిసారీ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే హార్దిక్ పాండ్యా వేసిన 10వ ఓవర్లో రాయ్ ఇబ్బందిపడ్డాడు. తొలి నాలుగు బంతులను ఆడలేకపోవడంతో ఐదో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లో ఎత్తుగా లేచింది. దాన్ని కీపర్ పంత్ సులభంగా అందుకోవడంతో జేసన్ రాయ్.. హాఫ్ సెంచరీ చెయ్యకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో ఆ జట్టు పది ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 66 పరుగులతో నిలిచింది.