మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు పోరాడుతోంది. ఆరంభంలోనే బెయిర్స్టో (0), రూట్ (0) డకౌట్ అయినా.. ఆ తర్వాత బెన్ స్టోక్స్ (27), జేసన్ రాయ్ (41) ఆ జట్టును కొద్దిసేపు ఆదుకున్నారు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కానీ హార్దిక్ పాండ్యా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ముందుగా రాయ్ను ఆ తర్వాత స్టోక్స్ను పెవిలియన్ చేర్చాడు.
దీంతో ఇంగ్లండ్ బ్యాటింగ్పై తీవ్రమైన ఒత్తిడి పడింది. ఇలాంటి సమయంలో నెమ్మదిగా ఆడిన ఇంగ్లండ్ సారధి బట్లర్ (32 నాటౌట్), మొయీన్ అలీ (24 నాటౌట్) ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీళ్లిద్దరూ నిదానంగా ఆడటంతో ఆ జట్టు 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 131 పరుగులతో నిలిచింది.