ఇంగ్లండ్తో ఆడుతున్న ఐదో టెస్టులో భారత జట్టు పట్టు సడలించకూడదని మాజీ లెజెండ్ వసీం జాఫర్ హెచ్చరించాడు. అంతకుముందు పంత్ (146), జడేజా (104) సెంచరీలతోపాటు కెప్టెన్ బుమ్రా (31 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో భారత జట్టు 416 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ను బుమ్రా తన బౌలింగ్తో కూడా దెబ్బ తీశాడు.
దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 84/5 స్కోరుతో నిలిచింది. అయితే ఐదు వికెట్లు పడిన తర్వాత కూడా ఇంగ్లండ్ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడం చూశామని, ఆ అవకాశం ఇంగ్లండ్కు ఇవ్వకుండా టీమిండియా జాగ్రత్త పడాలని జాఫర్ సూచించాడు.
బెన్ స్టోక్స్, జానీ బెయిర్స్టో వికెట్లు చాలా కీలకమైనవని, వాటిని తీసుకుంటే భారత జట్టు పూర్తి కంట్రోల్లో ఉన్నట్లు చెప్పొచ్చని వివరించాడు. మరి భారత బౌలర్లు మూడో రోజు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి.