హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిభ కల్గిన సెయిలర్లకు పదును పెట్టేందుకు ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్(ఈఎమ్ఈఎస్ఏ) సిద్ధమైంది. హుసేన్ సాగర్ జలాశయం వేదికగా ఎన్సీసీ క్యాడెట్ల కోసం భారత లేజర్ క్లాస్ అసోసియేషన్(ఎల్సీఏఐ)తో కలిసి ఈఎమ్ఈఎస్ఏ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా క్యాడెట్లను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసింది. బుధవారం మొదలైన ఈ క్యాంప్ ఈనెల 25 వరకు కొనసాగుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టిన సుబేదార్ మేజర్ బీకే రావత్ చీఫ్ కోచ్గా వ్యవహరించనున్నారు. సెయిలింగ్లో ముఖ్యమైన ట్రిమ్మింగ్, ట్యాకింగ్, జైబింగ్, రిగ్గింగ్పై క్యాడెట్లకు రావత్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.