మాదాపూర్: బాస్కెట్బాల్లో రాణించేందుకు ఎలైట్ ఉమెన్స్ ప్రో లీగ్ వేదికగా మారింది. మాదాపూర్లోని డ్రీమ్ బాస్కెట్బాల్ అకాడమీ వేదికగా శనివారం సీజన్-1కు తెరలేచింది. మహిళా బాస్కెట్బాల్ ప్లేయర్ల కోసం ఈ లీగ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ నెల 11వ తేదీ వరకు జరుగనున్న లీగ్లో హైదరాబాద్ సహా బెంగళూరు, ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ పోటీపడనున్నాయి. 5X5 తరహాలో జరుగనున్న లీగ్లో సత్తాచాటేందుకు ప్లేయర్లు తహతహలాడుతున్నారు.