హైదరాబాద్: మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో ఎన్ఎన్ఎస్ భోపాల్కు చెందిన ఏకలవ్య బాతమ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గురువారం జరిగిన నాలుగు రేసుల్లో ఏకలవ్య అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ విభాగంలో మొత్తం ఎనిమిది రేసులు పూర్తయ్యే సరికి ఏకలవ్య, శశాంక్ 13 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో దివ్యాంశి నంబర్వన్ స్థానం దక్కించుకుంది.