న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు సత్తాచాటారు. ఎనిమిది మంది బాక్సర్లు సెమీఫైనల్కు చేరి పతకాలు ఖాయం చేసుకున్నారు. ఇప్పటకే అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పరి (50 కేజీలు), నిధి (66 కేజీలు) మరోసారి నిలకడైన ప్రదర్శన కనబర్చగా.. పాయల్ (48 కేజీలు), అమీశౠ (54 కేజీలు), నేహ (46 కేజీలు), ప్రాచి (54 కేజీలు) మహిళల విభాగంలో సెమీఫైనల్కు దూసుకెళ్లారు.
మొత్తం ఈ టోర్నీలో భారత్ నుంచి ఏడుగురు మహిళా బాక్సర్లు బరిలోకి దిగగా.. అందులో కేవలం జయశ్రీ దేవి (60 కేజీలు) మాత్రమే సెమీస్ చేరలేకపోయింది. బాలుర విభాగంలో.. నలుగురు భారత బాక్సర్లు బరిలోకి దిగగా.. అందులో ఇద్దరు సెమీఫైనల్లో అడుగుపెట్టి పతకాలు ఖాయం చేసుకున్నారు. హార్దిక్ పన్వర్ (80 కేజీలు), జతిన్ (54 కేజీలు) తమ ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలతో సెమీస్కు చేరారు.