జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఆదివారం జంషెడ్పూర్ ఎఫ్సితో జరిగిన మ్యాచ్లో ఈస్ట్బెంగాల్ ఎఫ్సీ 3-1 స్కోరుతో ఘనవిజయం సాధించింది. రెండో నిమిషంలోనే సుహైర్ చేసిన గోల్తో ఈస్ట్బెంగాల్ ఆధిక్యం సాధించగా, 26వ నిమిషంలో క్లీటన్ సిల్వ ఆధిక్యాన్ని రెండింతలు చేశాడు. విరామానికి ముందు జయ్ ఇమాన్యుయెల్ గోల్తో జంషెడ్పూర్ అంతరాన్ని తగ్గించింది. అయితే ద్వితీయార్ధంలో క్లీటన్ 58వ నిమిషంలో మరో గోల్ చేసి ఈస్ట్బెంగాల్ను తిరుగులేని స్థితిలో నిలిపాడు. ఆద్యంతం ఈస్ట్బెంగాల్దే ఆధిపత్యం కొనసాగింది.