బెంగళూరు: ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (95 నాటౌట్; 11 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్తో చెలరేగడంతో సౌత్జోన్, వెస్ట్ జోన్ మధ్య సాగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతున్నది.
298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ జోన్.. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.వెస్ట్జోన్ విజయానికి 116 పరుగుల దూరంలో ఉంది.