బెంగళూరు: దేశవాళీ సంప్రదాయ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్కు వేళైంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న తుదిపోరులో వెస్ట్ జోన్తో సౌత్ జోన్ తలపడనుంది. యువ ఆటగాళ్లు తమ ప్రతిభకు పదును పెట్టుకునేందుకు ఇది చక్కటి అవకాశంగా నిలువనుంది. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి సౌత్ జోన్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా.. తొలిసారి భారత టీ20 జట్టుకు ఎంపికైన ఠాకూర్ తిలక్ వర్మతో పాటు మయాంక్ అగర్వాల్, రికీభూయ్ రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిరుడు దులీప్ ట్రోపీ ఫైనల్లో వెస్ట్ చేతిలో ఓడిన సౌత్ జోన్ ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని భావిస్తున్నది. ప్రియాంక్ నాయకత్వం వహిస్తున్న వెస్ట్ జట్టులో చతేశ్వర్ పుజారా, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ కీలకం కానున్నారు.