దుబాయ్: అంపైర్ నిర్ణయ సమీక్ష (DRS) తొలిసారి టీ20 వరల్డ్కప్లో అమలు కాబోతోంది. ఈ మధ్యే ఐసీసీ రిలీజ్ చేసిన ప్లేయింగ్ కండిషన్స్లో ఈ DRS గురించి ప్రస్తావించింది. ఈ నెల 17 నుంచి నవంబర్ 14 వరకూ టీ20 వరల్డ్కప్ జరగనున్న విషయం తెలిసిందే. తొలిసారి టీ20 వరల్డ్కప్లో అమలు కానున్న DRSలో భాగంగా ఒక్కో టీమ్కు ఇన్నింగ్స్కు రెండు రీవ్యూలు ఇవ్వనున్నారు. కొవిడ్ కారణంగా ఒక్కోసారి అంతగా అనుభవం లేని అంపైర్లు ఉండొచ్చని, అందుకే ఒక రీవ్యూకు బదులుగా రెండు ఇవ్వనున్నట్లు గతేడాది జూన్లోనే ఐసీసీ ప్రకటించింది.
దీని ప్రకారం వన్డే, టీ20ల్లో ఒక్కో ఇన్నింగ్స్కు రెండేసి, టెస్టుల్లో మూడేసి రీవ్యూలు ఉంటాయి. టీ20 వరల్డ్కప్లో ఇంతవరకూ ఎప్పుడూ డీఆర్ఎస్ను అమలు చేయలేదు. 2016లో చివరిసారి ఈ మెగా టోర్నీ జరిగిన సమయంలో టీ20ల్లో డీఆర్ఎస్ను ఆమోదించలేదు. 2018లో ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్కప్తోనే ఇంటర్నేషనల్ టీ20 టోర్నీలో తొలిసారి డీఆర్ఎస్ అమల్లోకి వచ్చింది. 2020 వుమెన్స్ టీ20 వరల్డ్కప్లోనూ దీనిని ఉపయోగించారు.