జూబ్లీహిల్స్, నవంబర్ 10: డీఆర్ఐఎఫ్టీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో నవంబర్ 9, 10 తేదీలలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ పోటీలలో ఉభయ రాష్ర్టాలలో 10 జట్లు పాల్గొన్నాయి. వెస్టీండీస్ క్రికెటర్ లాన్ బిషప్ వర్చువల్గా తన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్సీఏ ఉపాధ్యక్షులు జాన్ మనోజ్, ప్రముఖ సైకాలజిస్ట్ సంతోష్, జేపిహెచ్ ఫౌండర్ డైరెక్టర్ జి.సుదర్శనమ్, క్లినికల్ డైటీషియన్ డాక్టర్ మెర్సీ అమృత తదితరులు పాల్గొన్నారు.