న్యూఢిల్లీ : భారత స్టార్ క్రికెటర్లు ఐపీఎల్లో బిజీగా ఉండగా టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, ఇతర సహాయ సిబ్బంది జూన్లో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సన్నాహాలపై చర్చించేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో మంగళవారం సమావేశం కానున్నారు. గాయాలతో కీలక ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ అందుబాటులో లేకపోవడంతోపాటు ఇతర సమస్యలపై చర్చించనున్నారు.
ఈ యేడాది అక్టోబర్లో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని పనిభారంపైకూడా దృష్టి సారించనున్నారు. కోచ్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్, ఇతర సహాయ సిబ్బంది, లక్ష్మణ్ నేతృత్వంలోని ఎన్సీఏ బృందం ఈ చర్చలలో పాల్గొననున్నారు. జూన్ 7-11 తేదీలలో ఓవల్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాను ఢీకొననుంది.