హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐదు పదుల వయసులోనూ ఎవరికీ తీసిపోని రీతిలో పరుగుపై ప్రజల్లో అవగాహన కల్గించేందుకు ఆమె సిద్ధమయ్యారు. వృత్తిరీత్యా నేచర్క్యూర్ దవాఖానలో డాక్టర్ అయిన ఎమ్ నాగలక్ష్మి సైకిల్పై హైదరాబాద్ నుంచి సిద్దిపేట వరకు ప్రయాణించేందుకు సమాయత్తమైంది. సిద్దిపేటలో ఆదివారం జరుగనున్న హాఫ్ మారథాన్పై పోటీదారుల్లో ఆసక్తి కల్గించేందుకు ఆమె ఈ ప్రయాణాన్ని ఎంచుకుంది. ఇందుకు సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది. మెరుగైన ఆరో గ్యం కోసం ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న హాఫ్ మారథాన్ ప్రయత్నాన్ని నాగలక్ష్మి అభినందించారు.