కేప్టౌన్: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ కూతురు వామికా ఫోటోలు నిన్న తొలిసారి బయటకు వచ్చాయి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ వన్డే సమయంలో ఆ ఫోటోలు లీక్ అయ్యాయి. విరాట్ హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత .. స్టాండ్స్లో ఉన్న అనుష్కా, వామికా వైపు చూస్తూ కోహ్లీ సంకేతాలు చేశాడు. బ్యాట్తో ఊయల సంకేతం చేశాడు. అయితే ఆ సమయంలో టీవీ బ్రాడ్క్యాస్టర్ అనుకోకుండా అనుష్కా, వామికాను చూపించారు. దీంతో విరాట్ కూతురి ఫోటోలు వైరల్ అయ్యాయి. దానిపై ఇవాళ కోహ్లీ ఓ ప్రకటన చేశాడు. మిత్రులారా, మా కూతురి ఫోటోలను నిన్న స్టేడియంలో క్యాప్చర్ చేశారని, వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారని తెలిసినట్లు కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో తెలిపారు. అయితే తమకు తెలియకుండానే ఆ సంఘటన జరిగిందని, కెమెరా తమ వైపు ఫోకస్ చేసినట్లు తమకు తెలియదని కోహ్లీ అన్నాడు. ముందుగా చెప్పిన కారణాల ప్రకారం, తమ కూతురి ఫోటోను ఎవరూ తీయవద్దు అని, షేర్ చేయవద్దు అని కోహ్లీ తన అభిమానుల్ని కోరాడు. సోషల్ మీడియాకు తన కూతుర్ని ఇప్పుడే పరిచయం చేయడం సరికాదు అని, ఎందుకంటే ఆమెకు సోషల్ మీడియా అంటే ఏమిటో ఇప్పుడే అర్ధంకాదన్న విషయాన్ని కోహ్లీ మరోసారి గుర్తు చేశాడు. వామికా ఫోటోలను తీయవద్దు అని అనుష్కా పలుమార్లు మీడియా వ్యక్తులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.