భోపాల్: యువ షూటర్ దివ్యాంశ్సింగ్ పన్వర్ జాతీయ చాంపియన్షిప్లో రెండు స్వర్ణాలు చేజిక్కించుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్తో పాటు జూనియర్ విభాగంలోనూ దివ్యాంశ్ పసిడి పతకాలు కొల్లగొట్టాడు. ఎంపీ షూటింగ్ అకాడమీ వేదికగా శుక్రవారం జరిగిన 64వ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్ పోటీల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్లో దివ్యాంశ్ 250 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. రుద్రాక్ష్ బాలాసాహెబ్ పాటిల్ (మహారాష్ట్ర) 249.3 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. హృదయ్ హజారికా (అస్సాం) 228.2 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాడు. రాజస్థాన్కు చెందిన దివ్యాంశ్ జూనియర్ విభాగం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో 252.2 పాయింట్లతో పసిడి పతకం కైవసం చేసుకోగా.. రుద్రాక్ష్ (251.2), పార్థ్ మఖీజా (ఢిల్లీ, 229.9) వరుసగా రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు.