తాష్కెంట్: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కొత్త చరిత్ర లిఖించింది. డోపింగ్ ఆరోపణలతో 21 నెలల పాటు సస్పెన్షన్ ఎదుర్కొన్న దీప అద్భుత ప్రదర్శనతో సత్తాచాటింది. ఏషియన్ సీనియర్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో దీప పసిడి పతకంతో మెరిసింది. ఈ టోర్నీలో స్వర్ణం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్గా దీప అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల వాల్ట్ ఫైనల్లో ఈ సీనియర్ జిమ్నాస్ట్ 13.566 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కిమ్సాన్ హ్యాంగ్(13.466), జో క్యాంగ్ బోల్(12.966) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.