డర్బన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత ప్యాడ్లర్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శరత్ కమల్ 4-1 (11-8, 9-11, 11-9, 11-6, 11-6)తో డేవిడ్ (ఆస్ట్రియా)పై, సాతియాన్ 4-3 (11-9, 11-8, 7-11, 11-2, 13-15, 11-13, 11-6)తో టామ్ జార్విస్ (ఇంగ్లండ్)పై గెలిచాడు.
మహిళల సింగిల్స్లో మనిక బాత్రా 4-0తో లిండా (అల్జేరియా)పై విజయం సాధించింది.