చెన్నై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. తనపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి సంపత్కుమార్పై తగిన చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఐపీఎల్ బెట్టింగ్ వివాదంలో తన పేరును చేర్చినందున సంపత్కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధోనీ తన పిటిషన్లో పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో సంపత్ కుమార్ తన పేరును ప్రస్తావించినందుకు అతడి నుంచి రూ.100 కోట్ల పరిహారం ఇప్పించాలని ధోనీ తన అర్జీలో కోరాడు.
ఈ కేసు శనివారం విచారణకు రావాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా పడింది. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసును సంపత్కుమార్ విచారణ జరిపారు. ఆ తరుణంలో ధోనీ అభ్యర్ధన మేరకు స్పాట్ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంలో ఆధారాలు లేకుండా ధోనీ పేరును చేర్చవద్దని కోర్టు సంపత్కుమార్కు సూచించింది. అయితే సంపత్కుమార్ ఆ సూచనను పాటించకుండా మ్యాచ్ఫిక్సింగ్లో ధోనీ పేరు ప్రస్తావించారు. దీంతో ధోనీ సంపత్కుమార్పై పరువునష్టం దావా వేశాడు.