కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన బ్యాట్స్మాన్ ధనుష్క గుణతిలక టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పాడు. టెస్టులకు రిటైర్మంట్ ప్రకటిస్తున్నట్లు గుణతిలక ఇవాళ ప్రకటించాడు. వన్డేలపై ఎక్కవ దృష్టిసారించడానికే టెస్టు క్రికెట్ స్వస్తి పలుకుతున్నట్లు ఆయన తెలిపాడు. కాగా, 30 ఏండ్ల గుణతిలక తన కెరీర్లో కేవలం ఎనిమిది టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 2018లో తన ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు.
ఈ ఎనిమిది మ్యాచ్లలో మొత్తం 299 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఉత్తమ స్కోరు 61. అయితే వన్డే మ్యాచ్లలో గుణతిలక ప్రదర్శన చాలా బాగుంది. మొత్తం 44 వన్డేలు ఆడిన ఆయన.. 36.19 సగటుతో 1,520 పరుగులు చేశాడు. అదేవిధంగా 30 టీ20 మ్యాచ్లు ఆడి 121.62 స్ట్రైక్ రేటుతో 568 పరుగులు సాధించాడు.
కాగా, ధనుష్క గుణతిలకతోపాటు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లాలపై శ్రీలంక క్రికెట్ బోర్డు గతంలో ఏడాది నిషేధం విధించింది. బయో బబుల్ ప్రొటోకాల్ను ఉల్లంఘించినందుకు వారిపై నిషేధం విధిస్తున్నట్లు అప్పట్లో క్రికెట్ బోర్డు ప్రకటించింది. శనివారం ఆ ముగ్గురిపై ఎస్ఎల్సీ నిషేధం ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ గుణతిలక తాను టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.