న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక బధిర ఒలింపిక్స్లో తెలంగాణ యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ మళ్లీ మెరిశాడు. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం దక్కించుకున్న శ్రీకాంత్.. శనివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో ప్రియేశా దేశ్ముఖ్తో మరో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ధనుశ్-ప్రియేషా ద్వయం 16-10 తేడాతో జర్మనీ జోడీ సెబాస్టియన్ హెర్మనీ, సబ్రినా ఎకెర్ట్పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచి తమదైన దూకుడు కనబరిచిన భార త జోడీ కీలక పాయింట్లు కొల్లగొడుతూ ముందుకు సాగింది. హైదరాబాద్ ఏస్ షూటర్ గగన్ నారంగ్ దగ్గర ధనుశ్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు. డెఫ్ఒలింపిక్స్లో పది మంది షూటర్లు బరిలోకి దిగగా మూడు స్వర్ణాలు సహా రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.