మియామి: వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో భాగంగా అమెరికాలోని మియామి సిటీలో చివరి టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లను టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ కూడా ప్రత్యక్షంగా వీక్షించింది. మియామి మెట్రోపాలిటన్ ఏరియాలో ఉన్న లౌడెర్హిల్ స్టేడియంలో ఆ మ్యాచ్ జరిగింది. అయితే ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న ధనశ్రీ వర్మ.. ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో అప్లోడ్ చేసింది. మియామిలో క్రికెట్ ప్రేమికుల్ని చూసి స్టన్ అవుతున్నట్లు ధనశ్రీ తన కామెంట్ సెక్షన్లో రాసింది.
చివరి టీ20 మ్యాచ్లో బ్యాటర్ బ్రాండన్ కింగ్ 85 రన్స్తో నాటౌట్గా నిలిచి విండీస్ కు సిరీస్ను అందించాడు. ఆ సిరీస్ను ఇండియా 2-3 తేడాతో కోల్పోయింది. ఇండియా విసిరిన 166 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఈజీగా ఛేజ్ చేసింది. పూరన్, కింగ్ మధ్య 107 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది.