బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబాంగ్ ఢిల్లీ మరో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 52-35తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ను చిత్తు చేసింది. ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 25 రైడ్లకు 24 పాయింట్లతో అదరగొట్టి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. తొలుత అద్భుత పోరాటం కనబర్చిన బెంగాలీ జట్టు అనంతరం ఢీలా పడింది. మనీందర్ (16 పాయింట్లు) ఒంటరి పోరాటం చేసినా జట్టు ఓటమి బాట పట్టక తప్పలేదు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింటిని నెగ్గి.. ఒకటి ‘టై’ చేసుకున్న దబాంగ్ ఢిల్లీ 18 పాయింట్లతో టాప్లో దూసుకెళ్తున్నది. మరో మ్యాచ్లో హోరాహోరీగా పోరాడిన యూపీ యోధ- గుజరాత్ జెయింట్స్ 32-32తో ‘టై’గా ముగించాయి.