హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో హైదరాబాద్ ఆరింటిలో ఓడి ఒకే ఒక పాయింట్తో గ్రూపు-బిలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఢిల్లీతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో భారీ ఓటమి చవిచూసింది.
హైదరాబాద్ నిర్దేశించిన 47 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో కెప్టెన్ యశ్ ధల్(9) వికెట్ కోల్పోయిన ఢిల్లీ 8.4 ఓవర్లలో విజయాన్నందుకుంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 90/5 చివరి రోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్కు దిగిన హైదరాబాద్..హర్షిత్ రానా(7/45) ధాటికి 124 పరుగులకు ఆలౌటైంది. రోహిత్రాయుడు(32), ప్రణీత్రాజ్(27) ఫర్వాలేదనిపించారు.