ముంబై: డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందింది. తొలుత బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది.
పెర్రీ (52 బంతుల్లో 67 నాటౌట్) అజేయ అర్ధశతకంతో రాణించగా.. రిచా ఘోష్ (16 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు ఖాతాలో వేసుకుంది. లక్ష్యఛేదనలో ఢిల్లీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసింది. కాప్సీ (38), రోడ్రిగ్స్ (32), మరినె కాప్ (32 నాటౌట్), జెస్ జాన్సన్ (29 నాటౌట్) రాణించారు.