Rishabh Pant | విశాఖపట్నం: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు జరిమానా పడింది. ఆదివారం చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు పంత్కు రూ.12 లక్షల ఫైన్ విధించారు.
నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్ ప్రకటనలో పేర్కొంది.