Rishabh Pant | రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. ‘రిషబ్ పంత్.. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. పరీక్షలన్నీ పూర్తైన తర్వాత పూర్థిస్థాయి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం. రిపోర్ట్స్ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని మ్యాక్స్ హాస్పిటల్ తరఫున డాక్టర్ ఆశిష్ యాగ్నిక్ ప్రకటించారు.
రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని రూర్కీ వద్ద పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ప్రమాదంలో పంత్కు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.